ఇన్స్టా రీల్స్ చిచ్చు: కోడలి వేధింపులతో అత్తమామల ఆత్మహత్య
- హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఘటన
- కోడలి ఇన్స్టాగ్రామ్ రీల్స్, వస్త్రధారణపై వివాదం
- కోడలితో పాటు ఆమె కుటుంబం వేధించిందని ఆరోపణ
- విషం తాగడంతో చికిత్స పొందుతూ దంపతులు మృతి
- కోడలితో సహా నలుగురిపై కేసు నమోదు, పరారీలో నిందితులు
హర్యానాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కోడలు ధరించే పొట్టి దుస్తుల విషయంలో తలెత్తిన వివాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. కోడలు, ఆమె కుటుంబసభ్యుల నుంచి వేధింపులు తీవ్రం కావడంతో మనస్తాపానికి గురైన అత్తమామలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన పానిపట్ జిల్లాలో జరిగింది.
పానిపట్ జిల్లా నారా గ్రామానికి చెందిన రాజేష్ (46), సుమన్ (44) దంపతుల కుమారుడు ఆశిష్... సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఢిల్లీకి చెందిన స్నేహ అనే యువతిని ప్రేమించాడు. 2025 జనవరిలో ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి వివాహం జరిగింది. అయితే, పెళ్లికి ముందు నుంచే సోషల్ మీడియాలో చురుకుగా ఉండే స్నేహ పెళ్లి తర్వాత కూడా రీల్స్ చేయడం కొనసాగించింది.
ఆమె ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం, పొట్టి దుస్తులు ధరించడం గ్రామీణ నేపథ్యం ఉన్న అత్తమామలు రాజేష్, సుమన్లకు నచ్చలేదు. ఈ విషయమై వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈ గొడవల్లో స్నేహ తల్లిదండ్రులు, సోదరి కూడా జోక్యం చేసుకున్నారు. వారంతా కలిసి రాజేష్ దంపతులను మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. స్నేహ పలుమార్లు అత్తమామలపై చేయి చేసుకున్నట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వేధింపులు భరించలేక తీవ్ర మనోవేదనకు గురైన రాజేష్, సుమన్ దంపతులు మే 9న ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరేలోపే సుమన్ మృతి చెందగా, రోహ్తక్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేష్ ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచారు.
ఈ ఘటనపై మృతుడు రాజేష్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కోడలు స్నేహ, ఆమె తల్లిదండ్రులు, సోదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు నలుగురూ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
పానిపట్ జిల్లా నారా గ్రామానికి చెందిన రాజేష్ (46), సుమన్ (44) దంపతుల కుమారుడు ఆశిష్... సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఢిల్లీకి చెందిన స్నేహ అనే యువతిని ప్రేమించాడు. 2025 జనవరిలో ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి వివాహం జరిగింది. అయితే, పెళ్లికి ముందు నుంచే సోషల్ మీడియాలో చురుకుగా ఉండే స్నేహ పెళ్లి తర్వాత కూడా రీల్స్ చేయడం కొనసాగించింది.
ఆమె ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం, పొట్టి దుస్తులు ధరించడం గ్రామీణ నేపథ్యం ఉన్న అత్తమామలు రాజేష్, సుమన్లకు నచ్చలేదు. ఈ విషయమై వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈ గొడవల్లో స్నేహ తల్లిదండ్రులు, సోదరి కూడా జోక్యం చేసుకున్నారు. వారంతా కలిసి రాజేష్ దంపతులను మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. స్నేహ పలుమార్లు అత్తమామలపై చేయి చేసుకున్నట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వేధింపులు భరించలేక తీవ్ర మనోవేదనకు గురైన రాజేష్, సుమన్ దంపతులు మే 9న ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరేలోపే సుమన్ మృతి చెందగా, రోహ్తక్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేష్ ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచారు.
ఈ ఘటనపై మృతుడు రాజేష్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కోడలు స్నేహ, ఆమె తల్లిదండ్రులు, సోదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు నలుగురూ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.